బాలికను కొనుగోలు చేసి పెళ్లి చేసుకున్నాడు !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌ ధోల్‌పూర్‌ జిల్లా మానియా  గ్రామానికి చెందిన 38 ఏళ్ల భూపాల్‌ సింగ్ ఏడేళ్ల వయసు ఉన్న ఓ బాలికను ఆమె తండ్రి నుంచి రూ.4.5లక్షలకు కొనుగోలు చేశాడు. అనంతరం మే 21వ తేదీన ఆ బాలికను భూపాల్‌ సింగ్‌ వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై తమకు సమాచారం అందినట్లు ధోల్‌పూర్‌ పోలీసు సూపరింటెండెంట్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. సమాచారం అందిన వెంటనే మానియా డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ దీప్‌క్‌ ఖండేల్వాల్‌  నేతృత్వంలోని పోలీసు బృందం బాలిక ఇంటి వద్దకు చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనలో ఎంతమంది ప్రమేయం ఉందనే దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తు అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)