నన్ను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని మోడీనే చూశా !

Telugu Lo Computer
0


కర్ణాటకలో ని బాగల్ కోట్ జిల్లాలో జరిగి ఎన్నికల బహిరంగ సభలో ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ  మీకు ( మోడీ) జరిగిన దూషణలు కేవలం ఒక పేజీలో సరిపోతాయని, మీరు నా కుటుంబం పట్ల ప్రవర్తించిన తీరుకు ఒక పుస్తకమే నిండుతుందని ఆమె అన్నారు. గత రెండు మూడు రోజుల నుంచి ప్రధాని నరేంద్ రమోడీని చూస్తే వింతగా ఉందని, నేను చాలా మంది ప్రధానులను చూశాను, ఇందిరాగాంధీ దేశం కోసం బుల్లెట్ గాయాలను భరించారు, రాజీవ్ గాంధీ తన ప్రాణాలు అర్పించారు, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ దేశం కోసం కష్టపడ్డారు, కానీ మోడీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదని ప్రియాంకాగాంధీ అన్నారు. ప్రజల బాధలను వినేందుకు వచ్చే ప్రధానులను చూశాను కానీ, తనను తిడుతున్నారని ప్రజల ముందు తన బాధలను చెప్పే ప్రధానిని మోడీనే చూశానని ఆమె అన్నారు. ''నా సోదరుడు రాహుల్ గాంధీని చూసి దైర్యం తెచ్చుకోండి మోడీజీ, ఈ దేశం కోసం బుల్లెట్ దెబ్బలుతినేందుకు సిద్ధంగా ఉన్నారు, మీరు దూషించినా, కాల్చి చంపినా, నిజం కోసం నిలబడతానని రాహుల్ గాంధీ చెప్పాడు'' అని ప్రియాంకాగాంధీ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)