దుర్గం చిన్నయ్యకు మావోయిస్టుల వార్నింగ్

Telugu Lo Computer
0


తెలంగాణ ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్యకు మావోయిస్టు కమిటీ వార్నింగ్ ఇచ్చింది. సమస్యలతో వచ్చే మహిళలను ప్రలోభపెట్టి లొంగదీసుకోవడం ఎంఎల్‌ఎకు అలవాటుగా మారిందని సింగిరేణి మావోయిస్టు కోల్‌బెల్డ్ ఏరియా కార్యదర్శి ప్రభాత్ మండిపడ్డారు. ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మార్చుకోవడంలేదని, ఎంఎల్‌ఎకు డెయిరీ నిర్వాహకులు అమ్మాయిలను సరఫరా చేశారని, రైతుల నుంచి వసూలు చేసిన డబ్బును వెంటనే చెల్లించాలని ప్రభాత్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య మీద లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో మంచిర్యాల జిల్లాలలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)