ప్రసూతి వార్డులో నవజాత శిశువును నోట కరచుకెళ్లిన కుక్క !

Telugu Lo Computer
0


కర్ణాటక లోని శివమొగ్గ జిల్లా  ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూతి వార్డులోకి వచ్చిన ఓ వీధి కుక్క నవజాత శిశువును నోటకరచుకొని ఈడ్చుకెళ్లింది. ఉదయం 7 గంటల సమయంలో వీధికుక్క నవజాత శిశువును నోట కరచుకొని ప్రసూతి వార్డు చుట్టూ తిరగటాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు దాన్ని తరిమికొట్టారు. కుక్క నోటి నుంచి వదిలిన శిశువును వైద్యులు పరిశీలించగా అప్పటికే మరణించినట్లు తేలింది. వీధి కుక్క కాటు వల్లనే నవజాత శిశువు మరణించాడా అనే విషయంపై వైద్యులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, శిశువు మృతదేహం పోస్టు మార్టం తర్వాత విషయం తెలుస్తుందని వైద్యులు చెప్పారు. నవజాత శిశువు సమాచారం కోసం వైద్యులు ప్రసూతి వార్డును పరిశీలిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)