నాగర్ సోల్ - నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో చోరీ

Telugu Lo Computer
0


షిరిడీ నుంచి నర్సాపూర్ కు వెళ్తున్న నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల నుంచి నగదు, బంగారం, సెల్ ఫోన్ తోపాటు విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్ర పర్భాని జంక్షన్ లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన నాగరత్నం అనే మహిళ నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, 30 వేల నగదును దొంగలు అపహరించారు. ప్రయాణికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)