గురుగ్రామ్కు చెందిన సిమ్రన్జీత్ సింగ్ నందా అనే వ్యక్తికి కొద్ది రోజుల క్రితం వాట్సప్లో ఓ సందేశం వచ్చింది. యూట్యూబ్లో తాము చెప్పిన వీడియోలను లైక్ చేస్తే, ప్రతి లైక్కు రూ. 50 చెల్లిస్తామనేది దాని సారాంశం. ఇదో గొప్ప ఆదాయ మార్గమని ఆశ చూపించడంతో సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేసేందుకు నందా అంగీకరించాడు. తర్వాతి రోజు బాధితుడికి ఓ మహిళ ఫోన్ చేసి యూట్యూబ్లో లైక్స్ ఒప్పందంలో భాగంగా వ్యాపారపరమైన నిర్వహణ ఖర్చుల నిమిత్తం కొంత నగదు జమ చేయాలని కోరింది. నగదు పంపేందుకు లింక్ పంపుతున్నామని చెప్పింది. ఆమె పంపిన రిక్వెస్ట్పై క్లిక్ చేసిన తర్వాత విడతల వారీగా రూ. 8.5 లక్షల నగదు తన ఖాతా నుంచి బదిలీ అయినట్లు నందా గుర్తించాడు. దీనిపై సందేశం పంపిన వారిని సంప్రదించేందుకు ప్రయత్నించగా అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన నందా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే లైక్కు రూ. 50 !
April 03, 2023
0
Tags