ముంబై విమానాశ్రయంలో 4.62 కోట్ల విలువైన బంగారం పట్టివేత

Telugu Lo Computer
0


ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా పెద్ద ఎత్తున తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా, దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారం తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. ఆ వ్యక్తి నుంచి 9 వేల గ్రాముల 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 4.62 కోట్లు ఉంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)