మోడీపై పోస్టర్ల కేసులో ఆరుగురు అరెస్టు

Telugu Lo Computer
0


ప్రధాని మోడీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వేల సంఖ్యలో వెలసిన పోస్టర్లు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా 'మోడీ హఠావో దేశ్‌ బచావో' పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిపై చర్యలకు ఉపక్రమించిన ఢిల్లీపోలీసులు ఇప్పటివరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పోస్టర్లకు సంబంధించి ఆప్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తోన్న ఓ వ్యానును పోలీసులు అడ్డుకుని, అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉన్న కొన్ని వేల పోస్టర్లను సైతం సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రింటింగ్‌ ప్రెస్‌కు సంబంధించిన సమాచారం ఆ పోస్టర్లపై లేదని ఢిల్లీ పోలీస్‌ ప్రత్యేక కమిషనర్‌ దీపేంద్ర పాఠక్‌ వెల్లడించారు. ఇప్పటివరకు ప్రధానికి వ్యతిరేకంగా అంటించిన 2వేల పోస్టర్లను తొలగించామని చెప్పారు. ప్రధాని మోడీపై పోస్టర్ల వ్యవహారంపై పోలీసుల చర్యను ఆమ్‌ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందన్న ఆప్‌ ఆరోపించింది. ఆ పోస్టర్లలో అభ్యంతరకరం ఏముందని ప్రశ్నించింది. వీటికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంపైనా మండిపడింది. భారత్‌ ప్రజాస్వామ్య దేశమనే విషయం మీకు తెలియకపోవచ్చని, ఒక్క పోస్టర్‌కే ఎందుకంత భయం అంటూ ట్వీట్‌ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)