నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ పెద్ద పల్లి జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఎం.బి.బి.ఎస్. మూడవ సంవ్సతరం పరీక్షలు రాసిన సనత్ ప్రాక్టికల్ పరీక్షలకు సిద్ధమవుతుంగా సూసైడ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిజామాబాద్ వన్ టౌన్ పోలీసులకు మెడికల్ కాలేజీ అధికారులు సమాచారం ఇచ్చారు.
మరో వైద్య విద్యార్థి ఆత్మహత్య !
March 31, 2023
0
Tags