మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి !

Telugu Lo Computer
0


ఆమ్వేకు అమితాబ్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని వీసీ సజ్జనార్‌ తప్పుపట్టారు. 'అమితాబ్‌తో పాటు మిగిలిన స్టార్‌ హీరోలందరికి నాదొక విన్నపం. మోసం చేసే కంపెనీలకు ప్రచారం చేయకండి. మీ స్టార్ డమ్‌ను మంచి కోసం వాడండి. మీ పేరు, ప్రతిష్టలను సమాజానికి చెడు చేసే కంపెనీలపై వెచ్చించొద్దు. ఆమ్వే లాంటి కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తున్నాయి. ఇలాంటి కంపెనీలకు ప్రచారం చేయడం వల్ల ప్రజలు, వ్యవస్థ మరింత నష్టపోయే ప్రమాదం ఉంది' అని ట్విట్టర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు సజ్జనార్‌. కాగా సజ్జనార్‌ హైదరాబాద్‌ సీపీగా ఉన్న సమయంలో జనాలను మోసం చేస్తోన్న పలు మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపారు. సంస్థల ఆస్తులను జప్తు చేశారు. అందుకే ఈ గొలుసుకట్టు కంపెనీ మోసాలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. గతంలో ఓ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థకు ప్రముఖటెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడాన్ని కూడా సజ్జనార్‌ తప్పుపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)