కర్ణాటకలోని హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన యువతి పెండ్లి జరగాల్సి ఉంది. పెండ్లిలో అందంగా కనిపించాలన్న పెండ్లికూతురు తాపత్రయం ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. దీంతో ఆమె స్థానికంగా ఓ బ్యూటీపార్లర్కు వెళ్లింది. అమె ముఖానికి బ్యూటీషియన్ ఫౌండేషన్ రాసి ఆవిరి పెట్టింది. దీంతో యువతి ముఖంపై బొబ్బలు వచ్చాయి. ముఖం ఆకారమే మారిపోయింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పెండ్లికొడుకు అసలు తనకు ఈ పెండ్లే వద్దని రద్దు చేసుకున్నాడు.
మేకప్ వికటించి పెండ్లి ఆగిపోయింది !
March 05, 2023
0