పద్మ అవార్డుల ప్రదానం

Telugu Lo Computer
0


ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ఫంక్షన్‌ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజకీయ రంగంలో చేసిన సేవలకు మాజీ కేంద్ర మంత్రి ఎస్‌ఎం కృష్ణకు పద్మవిభూషణ్‌ అవార్డును బహుకరించారు. మొత్తం 54 మందికి తొలివిడతలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అవార్డులను ప్రధానం చేశారు. తెలంగాణకు చెందిన కమలేశ్‌ డి పటేల్‌కు సామాజిక సేవారంగంలో పద్మభూషణ్‌ అవార్డును ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అదే రంగంలో ఏపీకి చెందిన సంకురాత్రి చంద్రశేఖర్‌, శాస్త్రసాంకేతిర రంగాల్లో తెలంగాణకు చెందిన విజయ్‌ గుప్తాకు పద్మశ్రీ లభించింది. తెలంగాణాకే చెందిన సాహితివేత్త రామకృష్ణారెడ్డికి, డాక్టర్‌ హనుమంతరావుకు పద్మశ్రీ అవార్డులను బహుకరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారమంగళం బిర్లాకు పద్మభూషణ్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన చింతలపాటి వెంకటపతిరాజుకు, సచ్చిదానంద శాస్త్రికి కూడా పద్మశ్రీ అవార్డును బహుకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)