ఆంధ్రప్రదేశ్లో స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయ్యింది. ఎస్డీసీ సర్వర్ డౌన్ వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులకు కూడా బ్రేక్ పడింది. డేటా సెంటర్లో అంతరాయం ఏర్పడడం వల్ల డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తోన్న సమయంలో సర్వర్లో ఈ సమస్య తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల అటెండెన్స్తో పాటు ఇతర సర్వీలకు తీవ్ర అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన సాంకేతిక నిపుణులు సమస్యను పరష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ సేవలకు అంతరాయం !
March 14, 2023
0
Tags