మధురలో సినీతారలే పోటీలో ఉండాలని మీరు కోరుకుంటున్నారా ?

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని మధుర బృందావనంలో గల బంకే బిహారీ ఆలయాన్ని ఇటీవల కంగనా రనౌత్ తన కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు భక్తులతోపాటు పెద్ద సంఖ్యలో స్థానికులు ఎగబడ్డారు. కంగన ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రజలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ పర్యటన సందర్భంగా విలేకరులు అడిగినప్పటికీ రాజకీయాల గురించి మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మధుర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కంగన పోటీ చేస్తారన్న వదంతులపై స్థానిక విలేకరులు హేమమాలినిని శనివారం ప్రశ్నించగా ఈ విషయంలో తన అభిప్రాయం ఏం చెప్పాలని అన్నారు. అంతా దైవ నిర్ణయం. మధురలో కేవలం సినీతారలు ఉండాలనే మీరు కోరుకుంటున్నారు. వేరే ఎవరికైనా ఇక్కడ నుంచి ఎంపిక కావాలని ఉన్నా మీరు అలా కానివ్వరు. మీకు మాత్రం సినిమా స్టార్లే ఎంపీగా ఉండాలి. రేపు రాఖీ సావంత్ కూడా మధుర నుంచి ఎంపిక కావచ్చు అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014లో తొలిసారి మథుర నుంచి లోక్‌సభ ఎంపీగా గెలిచిన హేమమాలిని 2019లో ఇక్కడి నుంచే గెలిచారు.

Post a Comment

0Comments

Post a Comment (0)