ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో బాధిత కుటుంబం గురువారం రాత్రి దోమలను నివారించేందుకు మస్కిటో కాయిల్ను అంటించి పడుకున్నారు. రాత్రి సమయంలో ఈ కాయిల్ పరుపుపై పడి మెల్లగా అంటుకుని పొగ అలుముకుంది. తలుపులు, కిటికీలు కూడా పూర్తిగా మూసి ఉండడంతో పొగ కమ్ముకోవడాన్ని గమనించి వారు బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ విషపూరిత గాలి పీల్చడంతో స్పృహతప్పి పడిపోయారు. శుక్రవారం ఉదయం వారి ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆరుగురు చనిపోయి ఉండగా, మరో ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాత్రంతా విష వాయువు పీల్చడంతోనే ఈ కుటుంబంలోని ఆరుగురు మరణించారని, మరో ముగ్గురు అపస్మారక స్థితిలోనే ఉన్నారని తెలిపారు. ముగ్గురి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని చెప్పారు.
మస్కిటో కాయిల్ కు ఆరుగురు బలి
March 31, 2023
0
Tags