ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం

Telugu Lo Computer
0


ఈక్వెడార్ తీరంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.8గా నమోదైంది. ఈ భూకంపం వల్ల 12 మంది చనిపోయినట్లు తెలిసింది. భూమికి 66 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతున వచ్చి ఉంటే.. దీని ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండేది. భూకంప తీవ్రతను 6.5గా ఈక్వెడార్ ప్రభుత్వం అంచనా వేసింది. స్థానిక గ్వాయాస్ ప్రాంతంలో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. క్యూయెంకాలో ఓ భవనం... కారుపై కుప్పకూలడంతో... కారులోని వ్యక్తి చనిపోయినట్లు తెలిసింది. శాంటా రోసాలో మరో ముగ్గురు చనిపోయారని తెలిసింది. ప్రభుత్వ రిపోర్టుల ప్రకారం... శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూకంపం వచ్చినప్పుడు రాజధాని క్విటోకి ఆయిల్ సరఫరా చేసే ఎస్మెరాల్డాస్ ఆయిల్ పైప్‌లైన్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి సప్లై ప్రారంభించారు. టర్కీ, ఇండొనేసియా లాగా ఈక్వెడార్ కూడా... పసిఫిక్ మహా సముద్రం లోని రింగ్ ఆఫ్ ఫైర్ లోనే ఉంది. ఈ రింగులో అగ్ని పర్వతాలు ఎక్కువ. తరచూ ఇవి పేలుతూ ఉంటాయి. అందువల్ల భూకంపాలు కామన్. ఈక్వెడార్‌లో ఈమధ్య వచ్చిన భూకంపాల్లో 2016లో వచ్చినది తీవ్రమైనది. దాని వల్ల 600 మందికి పైగా చనిపోయారు.


Post a Comment

0Comments

Post a Comment (0)