వాగులో బస్సు పడి అయ్యప్ప భక్తులకు తీవ్ర గాయాలు

Telugu Lo Computer
0


తమిళనాడు నుంచి శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సు కేరళలోని పత్తనంతిట్ట జిల్లా నిలక్కల్ సమీపంలో అదుపుతప్పి ఓ వాగులో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 62 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పతనంతిట్ట, ఎరుమేలిలోని వివిధ ఆసుపత్రులకు తరలించామని పోలీసులు తెలిపారు. మరొకొంత మందిని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ఇలవుంకల్ ఎరుమేలి రోడ్డులోని మూడో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 26న ఉత్రం ఉత్సవాల సందర్బంగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తెరవడంతో శబరిమలలో ఈ ఏడాది ఉత్రం పండుగ సందర్భంగా అయ్యప్ప దర్శనం కోసం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుల లోతైన వాగులో పడటంతో పలువురు గాయపడినట్టు సమాచారం. అయితే సమయానికి అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించలేకపోయామని స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం ఏడుగురు పిల్లలతో సహా 68 మంది ఉన్నట్లు సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)