పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

Telugu Lo Computer
0


ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ విచారణకు ఈరోజు కవిత రెండోసారి హాజరయ్యారు. ఈ స్కామ్ లో నిందితుడు, హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించారు. వీరిద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి నాలుగు గంటల సేపు ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం పిళ్లై కస్టడీ ముగియడంతో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు. ఢిల్లీ స్పెషల్ కోర్టు పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. మరోవైపు కవితను ప్రస్తుతం ఈడీ అధికారులు ఒంటరిగా విచారిస్తున్నారు. ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారా?. లేక విచారణ అనంతరం పంపించేస్తారా? అనే విషయంలో స్పష్టత కానరావడంలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)