శివసేన పార్లమెంట్ నాయకుడిగా గజానన్ కీర్తికర్‌

Telugu Lo Computer
0


మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సంజయ్ రౌత్‌ను తొలగించింది. లోక్‌సభ ఎంపీ గజానన్ కీర్తికర్‌ను ఆయన వారసుడిగా నియమించింది. శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కీర్తికర్‌ను నియమించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ కు సీఎం షిండే లేఖ రాశారు. పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శివసేన నాయకులు కీర్తికర్‌ను గురువారం సన్మానించారు. లోక్‌సభలో ఉన్న 18 మంది శివసేన సభ్యులలో, నలుగురు ఉద్ధవ్ థాకరేతో ఉన్నారు. ఉద్దవ్ తన పార్టీని, గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గత సంవత్సరం శివసేన చీలిపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)