బీహార్ లోని సౌనోలి గ్రామానికి చెందిన అంకిత్ కుమార్, భాకురా భితాతి గ్రామానికి చెందిన ప్రీతి కుమారి అనే యువతితో ఫేస్బుక్లో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ మెసెంజర్లో చాటింగ్ చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ ఒకరి నంబర్ ఒకరు పంచుకున్నారు. ఇలా కొంతకాలం తర్వాత వారి స్నేహం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2022 డిసెంబర్ 27న కోర్టులో వివాహం జరిగిందని యువతి తెలిపింది. కొన్ని రోజుల తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఒక దేవాలయంలో పెళ్లిచేసుకున్నట్లు బాధితురాలు వెల్లడించింది. పెళ్లయ్యాక ఢిల్లీకి చేరుకుని నాలుగు నెలలు బాగానే ఉన్నామని, కొన్ని రోజుల తర్వాత అంకిత్ తనకు చెప్పకుండా ఊరికి పారిపోయాడని, గ్రామానికి చేరుకున్న తర్వాత తన మొబైల్ నంబర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని కోసం ఎదురుచూసి చివరకు తానూ ఢిల్లీ నుంచి గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో అంకిత్, అతని కుటుంబం ఇంట్లోకి రానివ్వలేదు. ప్రేమలో మోసపోయిన ప్రీతికి మరో మార్గం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. మష్రక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ, బాధితురాలు మొత్తం సంఘటనను తెలియజేసి, తన భర్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
ఫేస్ బుక్ లో కలిసి పెళ్లి చేసుకొని, తరువాత మొఖం చాటేశాడు !
March 31, 2023
0
Tags