మైక్రోఓవెన్‌ - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


మైక్రో ఓవెన్ ద్వారా కేకులు, బిస్కెట్లు వంటివాటిని తయారు చేసుకొని తినవచ్చు.  మైక్రో ఓవెన్ వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. దీనిలో ఏ పదార్థాలను వేడి చేయాలి ? వేటిని చేయకూడదనే వివరాలను తెలుసుకొని ఉపయోగించాలి. ముఖ్యంగా కొన్ని రకాల పదార్థాలను మైక్రో ఓవెన్‌లో పెట్టడం వల్ల అది పేలిపోయే ప్రమాదం ఉంది.  ఉడికించిన గుడ్లు లేదా రిఫ్రిజిరేటర్ లో ఉంచి అప్పుడే తీసిన గుడ్లను మైక్రో ఓవెన్‌లో ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే గుడ్డు పెంకులతో సహా ఓవెన్లో పెట్టడం వల్ల లోపల అవి పేలి, విద్యుత్ ప్రమాదాలకు కారణం కాగలవు. ఉడికించిన గుడ్లను పెంకు తీసేసిన తర్వాత వేడి చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు, కానీ పెంకులతో పాటు గుడ్డును లోపల పెట్టకూడదు. టమోటో సాస్‌ను చాలా మంది ఓవెన్ లో  వేడి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. టమోటో సాస్ వేడెక్కాలంటే అధిక ఉష్ణోగ్రత అవసరం. ఆ ఉష్ణోగ్రతకు ఓవెన్ చేరుకున్నాక ఆవిరి చాలా ఎక్కువగా మారుతుంది. దీనివల్ల దానిలో పేలుడు సంభవించవచ్చు. చాలామంది నీటిని మైక్రోఓవెన్‌లోనే వేడి చేస్తారు. నీటిని వేడి చేసే సమయంలో బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది. ఈ నీటి బుడగలు పేలడం వల్ల ఒక్కొక్కసారి ఓవెన్ పేలే ప్రమాదం ఉంది. ఒకవేళ నీటిని వేడి చేయాలి అనుకుంటే చాలా తక్కువ సమయంలోనే బయటికి తీసేయాలి. 30 సెకన్ల కన్నా ఎక్కువ సమయం నీటిని ఓవెన్ లో లోపల ఉంచకూడదు. ఎరుపు, పసుపు రంగులో ఉండే మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం అధికంగా ఉంటుంది. ఇది మిరియాలకు, మిరపకాయలకు మండుతున్న రుచిని ఇస్తుంది. మిరపకాయలను మైక్రోఓవెన్ లో పెట్టి వేడి చేయడం వల్ల అధిక ఆవిరి ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మైక్రో ఓవెన్ డోర్ తీయగానే ఆ ఆవిరి మన ముక్కు, కళ్ళు, శ్వాసకోశ భాగాలకు పట్టేసి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఓవెన్ లో ఎప్పుడు మిరపకాయలను ఉంచకూడదు. ద్రాక్ష పండ్లను మైక్రోఓవెన్ లో పెడితే చాలా ప్రమాదం.వాటిని మైక్రోఓవెన్ లో పెట్టగానే పేలే ప్రమాదం ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)