వివాహితపై తాంత్రికుడు అత్యాచారం

Telugu Lo Computer
0

 

రాజస్థాన్ లోని బస్స్వాడకు చెందిన ముఖేష్ గార్సియా తాంత్రికునిగా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఇటీవల అతనికి ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. సంతానం లేకపోవడంతో ఆమె ముఖేష్‌ను సంప్రదించింది. మరో నిందితుడు దిలావర్ షేక్ ఆమెను ముఖేష్ వద్దకు తీసుకెళ్లాడు. తనకు తెలిసిన తాంత్రిక ప్రక్రియతో సంతానం లేనివారు ఆశీర్వదించబడతారని ముఖేష్ గతంలో దిలావర్‌తో చెప్పాడు. ధనవంతులు కావాలనుకునే వారికి వరాలు కురిపిస్తానని చెప్పుకునేవాడు. దీంతో వివాహితను దిలావర్ షేక్ తన వద్దకు తీసుకెళ్లాడు. అతను చెప్పినట్టు చేస్తే పిల్లలు పుడతారని ఆమెలో కొత్త ఆశలు రేకెత్తించాడు ముఖేష్. ఈ క్రమంలో ముఖేష్ ముందుగా బాధితురాలిని ఖేడా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి మహిసాగర్‌ వెళ్లారు. ఆ తర్వాత ఆమెను రాజస్థాన్ సరిహద్దు సమీపంలోని దాహోద్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తన దుకాణంలో తాంత్రిక ప్రక్రియ పేరుతో అత్యాచారం చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా పలువురు మహిళల బలహీనతను ఆసరాగా చేసుకుని నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. మార్చి 16న షేక్ ను, ముఖేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)