కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ప్రకటన చేశారు. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో పొటీ చేయనున్న ఆయన, ఈ ఎన్నికల అనంతరం రాజకీయంగా తాను రిటైర్మెంట్ తీసుకుంటానని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే ఎన్నికల రాజకీయాల గురించి స్పష్టత వచ్చినప్పటికీ క్రియాశీల రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది, లేదంటే దాన్ని కూడా తప్పుకుంటారా లేదా అనేది స్పష్టత లేదు. తన కుమారుడి స్థానమైన వరుణ నుంచి పోటీకి సిద్ధమైన ఆయన.. కోలాన్ నియోజకవర్గం నుంచి కూడా పోటీకి సిద్ధమయ్యారు. వాస్తవానికి ఈ స్థానం నుంచే పోటీ చేయాలని ఆయన మొదట అనుకున్నప్పటికీ.. హైకమాండ్ నిర్వహించిన సర్వేలో ఆయన గెలుపు కష్టమని తేలింది. ఇక హైకమాండ్ సూచనతో ఆ స్థానం నుంచి పోటీ నుంచి తప్పుకుని కేవలం వరుణ నుంచే పోటీ చేయనున్నట్లు వనిపించింది. అయితే కేంద్రం సూచన మేరకు వరుణ నుంచి పోటీ చేయడమే కాకుండా, కోలార్ నుంచి కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. కోలార్ ప్రజలు తన అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకే రెండు స్థానాల్లో పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు.
ఇవే నా చివరి ఎన్నికలు !
March 29, 2023
0
Tags