హీరో అజిత్‌ తండ్రి కన్నుమూత

Telugu Lo Computer
0


కోలీవుడ్‌ ప్రముఖ హీరో అజిత్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. అజిత్‌ తండ్రి పి.సుబ్రమణియం (84) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోన్న ఆయన చికిత్స పొందుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణంతో అజిత్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలంటూ ట్వీట్స్‌ చేస్తున్నారు. బెసెంట్‌ నగర్‌లోని శ్మశానవాటికలో సుబ్రమణియం అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)