ఆఫీసులో లాడెన్‌ పోస్టర్లు కలకలం !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (యూపీపీసీఎల్‌) రవీంద్ర ప్రకాష్‌ గౌతమ్‌ అనే సబ్‌ డివిజనల్‌ అధికారి తన కార్యాలయంలో ఒసామాబిన్‌ లాడెన్‌ పోస్టర్లను ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో యూపీపీసీఎల్‌ చైర్మన్‌ ఎం దేవరాజ్‌ సీరియస్‌ అవ్వడమే గాక సదరు అధికారి గౌతమ్‌ని విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆయన 2022 జూన్‌లో ఫరుఖాబాద్‌ జిల్లాలోని కయామ్‌ గంజ్‌ సబ్‌డివిజన్‌ 2కి పోస్టింగ్‌ పై వచ్చాడు. అప్పుడే ఈ పోస్టర్లు ఉంచినట్లు సమాచారం. విచారణలో లాడెన్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసినందువల్లే  గౌతమ్‌ అతన్ని ఆరాధ్య దైవంగా పూజించేవాడని సహోద్యోగులు చెబుతున్నారు. అతనిపై అభిమానంతో లాడెన్‌ ఫోటోలు కార్యాలయంలో ఉంచేవాడని చెప్పారు. దీంతో అతన్ని సర్వీస్ నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)