గుజరాత్‌ ప్రభుత్వ కార్యక్రమంలో బిల్కిస్‌ బానో అత్యాచార నిందితుడు !

Telugu Lo Computer
0


గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై అత్యాచారానికి పాల్పడిన 11 మంది దోషుల్లో ఒకరైన శైలేష్‌ చిమ్నాలాల్‌ భట్‌ మార్చి 25న జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైయ్యాడు. పైగా ఆ వ్యక్తి అధికార బిజెపి ఎంపి, ఎమ్మెల్యేలతో స్టేజీని పంచుకోవడం గమనార్హం.  గతేడాది ఆగస్ట్‌ 15న ఈ దోషులందరినీ గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. వీరి విడుదలను సవాలు చేస్తూ బిల్కిస్‌బానోతో పాటు టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. శనివారం దాహోద్‌ జిల్లాలోని కర్మాడి గ్రామంలో ది గ్రూప్‌ వాటర్‌ సప్లై స్కీమ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దాహోద్‌ ఎంపి జశ్వంత్‌ సిన్హ్‌ భాభోర్‌, ఆయన సోదరుడు, లిమ్ఖేడా ఎమ్మెల్యే శైలేష్‌ భాభోర్‌లతో పాటు బిల్కిస్‌ బానో అత్యాచార కేసు నిందితుడు శైలేష్‌ చిమ్నాలాల్‌ భట్‌ కూడా హాజరయ్యారు. వారితో పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ఫోటోలకు ఫోజులిచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)