రూ 300 ప్రత్యేక దర్శనం టికెట్లు 27న విడుదల !

Telugu Lo Computer
0


వచ్చే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. తిరుమలలో వేసవి రద్దీకి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వచ్చే మూడు నెలలకు సంబంధించిన సేవా టికెట్లను విడుదల చేసిన టీడీడీ ఇప్పుడు ప్రత్యేక ప్రవేశ దర్శనం పైన ప్రకటన చేసింది. జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లను టీటీడీ ఇప్పటికే విడుదల చేసింది.శ్రీరామ నవమి వేడుకలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ నెలకు సంబంధించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ కోటా టికెట్లను ఈ నెల 27న విడుదల కానున్నాయి. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది. టీటీడీ వెబ్ సైట్ ..టీటీడీ యాప్ ద్వారా ఆన్ లైన్ టికెట్లు పొందవచ్చని స్పష్టం చేసింది. ఏప్రిల్ కు సంబంధించి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వీలుగా టోకెన్లను టీటీడీ ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక, వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ చెబుతోంది. శ్రీవాణి దర్శనాలను తగ్గించాలని నిర్ణయించింది. వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం సిఫార్సు లేఖలను నియంత్రించాలని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)