టీడీపీ నుంచి రూ 10 కోట్ల ఆఫర్ !

Telugu Lo Computer
0


ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తనకు రూ 10 కోట్ల ఆఫర్ టీడీపీ నుంచి వచ్చిందని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ బయట పెట్టారు. మొదటి బేరం తనకే వచ్చిందని రాపాక తన మిత్రులతో షేర్ చేసుకున్నారు. తొలుత తన మిత్రుడు కేఎస్ఎన్ రాజు ద్వారా సంప్రదింపులు చేశారని చెప్పుకొచ్చారు. అయితే, తన మిత్రుడు రాపాక అలా తీసుకొనే వ్యక్తి కాదని చెప్పి వారించారని వివరించారు. ఇక పోలింగ్ రోజు నాడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే తనకు నేరుగా ఆఫర్ ఇచ్చారని వివరించారు. టీడీపీకి మద్దతు ఇస్తే భవిష్యత్ లో మంచి పొజీషన్ ఉంటుందని హామీ ఇచ్చారని చెప్పారు. తాను మాత్రం వారి ఆఫర్ ను తిరస్కరించానని,  తాను సీఎం జగన్ ను నమ్ముకున్నానని, ఆయన నాయకత్వంలోనే పని చేస్తానని చెప్పానని రాపాక వెల్లడించారు. తన దగ్గర డబ్బు ఉండి కాదని, డబ్బు తీసుకుంటే సమాజంలో బతకలేమని రాపాక చెప్పారు. సిగ్గు శరం వదిలేస్తే తనకు రూ 10 కోట్లు వచ్చేవన్నారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిన విషయం మంత్రి వేణుతో పాటుగా ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ తో మాత్రం షేర్ చేసుకున్నట్లుగా వివరించారు. ఇదే సమయంలో మరి కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. ఎమ్మెల్సీ శ్రీదేవి గురించి పార్టీ ముందు నుంచే సందేహంతో ఉందని పేర్కొన్నారు. మేకపాటి కూడా టీడీపీతో టచ్ లో ఉన్నారని చెప్పారు. పోలింగ్ రోజు సమయంలోనూ అసెంబ్లీ లాబీల్లోనూ తనను సంప్రదంచారని వివరించారు. అయితే, ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేస్తారనే సమాచారం ముందే ఉందని రాపాక చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)