కర్ణాటకలో మాయమైన బస్సు తెలంగాణలో దొరికింది !

Telugu Lo Computer
0


కర్ణాటకలోమాయమైన కేఎస్‌ ఆర్టీసీ బస్సు తెలంగాణలో దొరికింది. కలబుర్గి డివిజన్‌లోని కలబుర్గి జిల్లా చించోళి బస్టాండ్‌లో నిలిపిన కళ్యాణ కర్ణాటక ఆర్టీసీ బస్‌ను దొంగలు నకిలీ తాళాలతో స్టార్ట్‌ చేసుకుని ఉడాయించారు. బీదర్‌ రెండవ డిపోకు చెందిన కేఏ 38 ఎఫ్‌ 971 బస్సు ఇది. బీదర్‌ నుంచి చించోళికి వచ్చి తెల్లవారుజామున 3.30 గంటలకు బస్సు మాయమైంది. మంగళవారం విధులకు వెళ్లాలని డ్రైవర్, కండక్టర్‌ వచ్చి చూడగా బస్సు లేకపోవడంతో కంగుతిన్నారు. పలుచోట్ల గాలించి చివరకు చించోళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు మార్గాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించి బస్సు వెళ్లిన దిశను గుర్తించారు. బస్సు బుధవారం తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూరు తాలూకా భూకైలాస తాండాలో లభించింది. దొంగల ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)