ఎన్‌కౌంటర్‌ లో ఉగ్రవాది హతం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 27 February 2023

ఎన్‌కౌంటర్‌ లో ఉగ్రవాది హతం !


దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని పద్గంపోరా వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇందులో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. డిజిపి దిల్‌బాగ్ సింగ్ ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. అయితే ఉగ్రవాదుల గుర్తింపును వెల్లడించలేదు. మూలాల ప్రకారం.. చంపబడిన ఉగ్రవాది కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో ప్రమేయం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరూ ప్రస్తుతం బేస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం పుల్వామాలో తన భార్యతో కలిసి మార్కెట్‌కు వెళ్తున్న కాశ్మీరీ పండిట్ బ్యాంక్ గార్డు సంజయ్ శర్మను ఉగ్రవాదులు కాల్చిచంపారు. పద్గంపొరలో హంతకులు దాక్కున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దాడి జరిగినప్పటి నుంచి పోలీసులు, భద్రతా బలగాల బృందాలు హంతకుల కోసం నిరంతరం గాలిస్తున్నాయి. పుల్వామా జిల్లా అచ్చన్ గ్రామంలో ఉగ్రవాదుల దాడిలో మరణించిన కాశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. ఈ సమయంలో ముస్లిం పొరుగువారు సోదరభావానికి ఉదాహరణగా నిలిచారు. సంజయ్ శర్మ అంత్యక్రియలకు కుటుంబంలా సహకరించారు. సంజయ్ శర్మ కుటుంబం అచ్చన్ గ్రామంలో నివసిస్తున్న ఏకైక కాశ్మీరీ పండిట్ కుటుంబం. సంజయ్ శర్మ కుటుంబంతో గ్రామంలో అందరికీ సత్సంబంధాలు ఉన్నాయని స్థానికులుతెలిపారు. అయితే కాశ్మీరీ పండిట్ బ్యాంక్ గార్డు సంజయ్ శర్మను పుల్వామాలోని అచన్‌లోని అతని ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్చి చంపిన రెండు రోజుల తరువాత ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. 2023లో మొదటి సారిగా ఉగ్రవాదుల లక్షిత కాల్పుల్లో సంజయ్ శర్మ అనే కాశ్మీర్ పండిత్ చనిపోయారు. 2022లో ముగ్గురు కాశ్మీరీ పండిట్‌లతో పాటు 18 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపారు.

No comments:

Post a Comment