ఐ ఫోన్‌ కోసం డెలివరీ బాయ్‌ హత్య !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని హాసన్‌ జిల్లా అరసికెరె పట్టణంలోని లక్ష్మీపురకు చెందిన హేమంత్‌ దత్త ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ను బుక్‌ చేశాడు. డెలివరీ సమయంలో నగదు ఇచ్చే ఆప్షన్‌ పెట్టాడు. అరసికెరె తాలూకాకు చెందిన డెలివరీ బాయ్‌ హేమంత్‌ నాయక్‌  ఈ నెల 11న ఫోన్‌ను తీసుకుని దత్త ఇంటికి వెళ్లాడు. అతడు ఫోన్‌ను తీసుకుని, ఇప్పుడే డబ్బులు తీసుకొని వస్తానని బాయ్‌ను కూర్చోబెట్టి లోపలికి వెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం హేమంత్‌ దత్త వెనుక వైపు నుంచి వచ్చి నాయక్‌ ను కత్తితో పొడిచాడు. బలమైన గాయాలై రక్తస్రావంతో  డెలివరీ బాయ్‌ కుప్పకూలి అక్కడే మృత్యువాత పడ్డాడు. తరువాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి 14వ తేదీన గోనెసంచిలో శవాన్ని మూటగట్టి స్కూటర్‌పై తీసుకెళ్లి సమీపంలోని కొప్పలు రైల్వేగేట్‌ సమీపంలో పడేసి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయాడు. మరోవైపు హేమంత్‌ నాయక్‌ కనిపించడం లేదని తల్లిదండ్రులు 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో రైల్వేగేటు వద్ద కాలిన శవం ఉందని తెలిసి పోలీసులు వెళ్లి పరిశీలించగా అది హేమంత్‌ నాయక్‌ మృతదేహంగా గుర్తించారు. నాయక్‌ మొబైల్‌కు వచ్చిన చివరి ఫోన్‌ కాల్‌ ఆధారంగా వెంటనే హేమంత్‌దత్తను అదుపులోకి తీసుకొని విచారించగా తానె హత్య చేసినట్లు చెప్పాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)