భర్తతో పాటు అత్తను కూడా చంపిన యువతి !

Telugu Lo Computer
0


భర్తను, అత్తను చంపి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, కొద్దికాలం ఫ్రిజ్‌లో దాచి ఉంచిన తర్వాత వాటిని వివిధ ప్రాంతాల్లో విసిరేసిన అసోం మహిళ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. వివాహేతర సంబంధమే ఇందుకు కారణంగా అనుమానిస్తున్నారు. నూన్‌మతి ఏరియాలో జరిగిన ఈ జంట హత్యల ఘటన సుమారు ఏడు నెలల తర్వాత ఈనెల 19న బయట ప్రపంచానికి తెలిసింది. నేరం ఒప్పుకోవడంతో నిందితురాలు వందన కలితను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో నిందితురాలు తన నేరం అంగీకరించింది. బాయ్ ఫ్రెండ్‌ సాయంతో భర్త అమర్‌జ్యోతి డే, అత్య శంకరి డేను హత్య చేసినట్టు తెలిపింది. గత ఏడాది 17వ తేదీన ఈ హత్యల ఘటన చోటుచేసుకుంది. భర్తను, అత్తను చంపి, మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఆ తర్వాత వాటిని మేఘాలయలోని పలు ప్రాంతాల్లో విసిరేసింది. భర్త శరీర భాగాలను దావ్కీ ఏరియాలోనూ, అత్త శరీర భాగాలను చెరపుంజిలోనూ పడేసింది. ఈ హత్యలకు అరూప్ డెక, ధన్‌జిత్ టెక అనే ఇద్దరు వ్యక్తులు సహకరించినట్టు పోలీసులు గుర్తించారు. కట్టుకున్న భర్తను, అత్తను ఇంత పాశవికంగా హత్య చేయడం వెనుక కారణంపై విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)