మహిళా కానిస్టేబుల్‌పై బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ అత్యాచారం

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ లోని నదియా జిల్లా ఔట్‌పోస్ట్‌లో తుంగి సరిహద్దు వద్ద ఉండే ఔట్ పోస్ట్ వద్ద విధులు నిర్వహించే ఇన్‌స్పెక్టర్ ఈ నెల 19వ తేదీన బీఎస్ఎఫ్ విభాగంలో మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్ స్పందించడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇన్‌స్పెక్టరుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేసినట్టు తెలిపారు. అయితే శాఖాపరమైన విచారణ జరుగుతున్నందున దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించేందుకు బీఎస్ఎఫ్ అధికారులు నిరాకరించారు. అయితే, ఇన్‌స్పెక్టరుపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)