గుజరాత్ లోని అహ్మదాబాద్కు చెందిన ప్రఫుల్ బిల్లోర్ అనే ఒక వ్యక్తి ఎంబీయే చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత ఐఐఎం-అహ్మదాబాద్ దగ్గర్లోనే 2017లో 'ఎంబీయే చాయ్వాలా' పేరుతో ఒక టీ స్టాల్ ఓపెన్ చేశాడు. దీనికి మంచి ఆదరణ దక్కింది. దీంతో ఇదే పేరుతో మరికొన్ని ప్రాంతాల్లో ఫ్రాంచైజీలు కూడా ఓపెన్ చేశాడు. ఇవి కూడా సక్సెస్ అయ్యాయి. అంతేకాదు, అతడు 'ఎంబీయే చాయ్వాలా' పేరుతోనే ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి, కంటెంట్ క్రియేటర్గా మారాడు. అతడి అకౌంట్కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. 1.5 మిలియన్లకు పైగా ఫాలోవర్లు చేరారు. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు చాయ్ షాపుల నుంచి, ఇటు సోషల్ మీడియా నుంచి అతడికి భారీ ఆదాయం వస్తోంది. ఆరేళ్లలో అతడు మంచి స్థానానికి ఎదిగాడు. తాజాగా మెర్సిడెస్ ప్రీమియమ్ ఎస్యూవీని కొనుగోలు చేశాడు. ఈ కారు ఖరీదు దాదాపు రూ.90 లక్షలుగా ఉంది. తన కొత్త కారు కొన్న విషయాన్ని ప్రఫుల్ సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లతో పంచుకున్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. చాయ్వాలా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ స్థాయి విజయం సాధించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మెర్సిడెస్ బెంజ్ కారు కొన్న ఎంబీయే చాయ్వాలా !
February 16, 2023
0
Tags