ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారు తప్ప మరొకటి కాదు అని కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు మనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టు మార్చి 4 వరకు సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను విచారించిన సీబీఐ.. ఎనిమిది గంటల తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రజల దృష్టి మరల్చేందుకే సిసోడియా అరెస్టు
February 27, 2023
0