బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 321/7 (తొలి ఇన్నింగ్స్) ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 223 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కంగారుల జట్టు భారత స్పిన్నర్ల ధాటికి 91 పరుగులకే తోకముడిచింది. తొలి ఇన్నింగ్స్లో (3/42)తో ఆకట్టుకున్న అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో (5/37).. తన స్పిన్ మాయాజాలంతో ఆసీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో (5/47)తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు 16 వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియాపై ఇండియాకు ఇన్నింగ్స్ విజయం
February 11, 2023
0