భర్త అనుకుని వేరే వ్యక్తి బైక్‌ ఎక్కిన మహిళ !

Telugu Lo Computer
0


కర్ణాటకలోని హావేరి జిల్లా రాణేబెన్నూరులో భార్యతో కలిసి పెట్రోలు పోయించుకునేందుకు వెళ్లిన వ్యక్తికి- అక్కడే నిలబడి ఉన్న మహిళను బండి ఎక్కమన్నాడు. పిలిచింది తన భర్తే అని ఆమె అనుకుంది. తన భార్య ధరించిన రంగు చీరే కట్టుకుని ఉండడంతో బైకు ఎక్కినావిడి తన భార్యే అని ఈయన అనుకున్నాడు. భర్త లాంటి బైకు, అదే సౌష్ఠవం, తెల్ల చొక్కా.. ఒకే రంగు హెల్మెట్ ఉండడంతో ఈమె కూడా పొరపాటు పడింది. జరిగిన పొరపాటు అర్థమైన ఐదు నిమిషాలలోనే ఆయన తిరిగి ఆమెను పెట్రోలు బంకు దగ్గరకు తీసుకు వచ్చాడు. అప్పటికే ఈయన భార్య, ఆమె భర్త అక్కడ వేచి చూస్తూ ఉంది. నలుగురూ మొహం కప్పి ఉంచే శిరస్త్రాణాలు ధరించి ఉండడంతో ఈ పొరపాటు జరిగిందని తెలుసుకుని వారితో పాటు, బంకులో ఉన్న వారూ ఆ విషయం తెలుసుకుని కడుపుబ్బా నవ్వుకున్నారు.  

Post a Comment

0Comments

Post a Comment (0)