కర్ణాటకలోని మాండ్య జిల్లా హోసహళ్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందెంలో ఓ ఎద్దు అకస్మాత్తుగా అక్కడే ఉన్న ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు గాయపడ్డాడు చిన్న చిన్న గడ్డిమోపులకు నిప్పుపెట్టి వాటిపై నుంచి ఎడ్లను దూకిస్తూ పందేన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించింది. పందేన్ని చూసేందుకు వచ్చిన వ్యక్తిని ఓ ఎద్దు అకస్మాత్తుగా కుమ్మి కిందపడేసింది. గాయాలపాలైన బాధితుడిని విమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంక్రాంతి వేడుకల్లో అపశృతి !
January 16, 2023
0
Tags