ఏటీఎం పగలగొట్టి దోపిడీకి యత్నం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో పండుగ పూట దొంగలు రెచ్చిపోయారు. వేములవాడ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు చోరీ చేశారు. . అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. అనంతరం కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. ఇదంతా ఓ కంట కనిపెడుతున్న హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం, సిగ్నల్ రావడంతో వెంటనే కోరుట్ల పోలీసులను అలర్ట్ చేసింది. పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్నారు. అప్పుడు చోరీ చేసిన నగదుతో కారులో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న దొంగల వాహనానికి అడ్డంగా వెళ్లారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుండగలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కారును, డబ్బును అక్కడే వదిలి పారిపోయారు. పారిపోయే క్రమంలో సంచుల్లోని డబ్బు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయింది. రోడ్డుపై పడిన డబ్బుతో సహా మిగతా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలో మెుత్తం రూ. 19 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. దొంగతనం, పోలీసుల చేజింగ్ అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దొంగల్ని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)