అసెంబ్లీకి నోట్ల కట్టలతో ఆప్ ఎమ్మెల్యే !

Telugu Lo Computer
0


న్యూ ఢిల్లీ లోని సిటీ గవర్నమెంట్ ఆసుపత్రికి చెందిన ప్రైవేటు కాంట్రాక్టురు ఒకరు తనకు లంచం ఇంచేందుకు ప్రయత్నించారని అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ నోట్ల కట్టలు తీసి అసెంబ్లీలో చూపించారు. రోహిణిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రిలో తాత్కాలిక స్టాఫ్‌ నియామకాల్లో అవకతకలు చోటుచేసుకున్నట్టు ఫిర్యాదు చేశారు. కొందరు పలుకుబడి గల వ్యక్తులు తన నోరు మూయించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తన ప్రాణలకు ముప్పు ఉందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి బెదరింపులకు తాను భయపడేది లేదన్నారు. లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన ప్రైవేటు కాంట్రాక్టరుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ''నాకు రక్షణ కావాలి. నా జీవితం ప్రమాదంలో పడింది'' అని సభకు తెలిపారు. దీనిపై స్పీకర్ వెంటనే స్పందించారు. ఇది చాలా సీరియస్ అంశమని పేర్కొంటూ మంత్రి ఫిర్యాదును పిటీషన్స్‌ కమిటీ ఆఫ్ హౌస్‌కు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)