సొంత థియేటర్‌ని ప్రారంభించిన దిల్‌రాజు

Telugu Lo Computer
0


హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో ఎస్వీసీ సినిమాస్ పేరుతో దిల్ రాజు ఓ మల్టిప్లెక్స్ ని ఓపెన్ చేశారు. దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి, శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి, అంకిత్ రెడ్డిలు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్ రాజు కూతురు ఈ థియేటర్ వ్యవహారాలు చూసుకోనున్నట్టు సమాచారం. నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా సినీ ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా ఎదిగారు. ఇప్పటికే చాలా సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే తన ఫ్యామిలీ కూడా సినీ రంగంలోకి వచ్చింది. దిల్ రాజు తమ్ముడు శిరీష్ నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఇటీవలే దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి కూడా నిర్మాతగా మారింది. శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా సినిమాలు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా చాలా థియేటర్స్ దిల్ రాజు చేతిలో ఉన్నాయి అని టాక్ కూడా వినిపిస్తుంది. ఇటీవల సంక్రాంతి సినిమాల రిలీజ్ టైములో కూడా ఈ టాక్ బయటకి వచ్చి థియేటర్స్ వివాదం వచ్చింది. తాజాగా దిల్ రాజు తన సొంత థియేటర్ ని ఓపెన్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)