భర్తను హత్య చేసిన భార్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ లో నానాజీపూర్ కు చెందిన ఒల్కే రాజు, జ్యోతి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. రోజువారి కూలిగా వెళ్లే రాజు మద్యానికి బానిసై పనులకు వెళ్తకుండా భర్యను కొడుతుండేవాడు. దీంతో ఇద్దరి మద్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం రాజు బాగా మద్యం సేవించి వచ్చి భర్యను, పిల్లలను కొట్టాడు. దీంతో కొపానికి గురైన జ్యోతి, రాజు నిద్రపోతుండగా ఆదివారం తెల్లవారుజామున కత్తితో పోడిచి చంపింది. ఈ విషయం స్థానికులకు తెలియడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)