ఉత్తర ప్రదేశ్, ఉపరాంఖ గ్రామానికి చెందిన సుగ్రీవ శ్రీవాస్ అనే 55 ఏళ్ల వ్యక్తి గ్రామంలోని స్కూల్లో ప్రిన్సిపల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2012 వరకు సాధారణ టీచర్గా ఉన్న ఆయన ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొందారు. తమ స్కూల్లోని పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే, గత కొద్దిరోజుల నుంచి కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలే అతడ్ని తీవ్రంగా వేధించసాగాయి. స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడికి తన బాధలు చెప్పుకుని ఏడ్చాడు కూడా. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆయన గురించి అంతా వెతికారు. ఎక్కడా ఆయన ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం స్కూల్కు వెళ్లిన విద్యార్థులకు క్లాస్ రూములో సుగ్రీవ విగత జీవిగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
క్లాస్ రూమ్లో శవమైన స్కూల్ ప్రిన్సిపాల్ !
January 20, 2023
0
Tags