అంజలీ సింగ్‌ ఇంట్లో చోరీ !

Telugu Lo Computer
0


ఢిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో మృతురాలు అంజలీ సింగ్‌ ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి తమ నివాసంలోకి కొందరు ఆగంతకులు చొరబడి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లినట్లు అంజలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ''ఈ ఉదయం పొరుగింటి వారు ఫోన్‌ చేసి చోరీ గురించి మాకు సమాచారమిచ్చారు. మేం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగలగొట్టి ఉంది. ఎల్‌సీడీ టీవీ, ఇతర వస్తువులు, బెడ్‌ కింద దాచిపెట్టిన కొన్ని విలువైన వస్తువులు కన్పించట్లేదు'' అని అంజలి సోదరి మీడియాకు తెలిపారు. దీని వెనుక అంజలి స్నేహితురాలు నిధి హస్తం ఉండొచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ డ్రగ్స్‌ కేసులో నిధి నిందితురాలిగా ఉండటం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)