ఆ మహిళే తన సీటులో మూత్ర విసర్జన చేసుకుంది ?

Telugu Lo Computer
0


ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళపై మూత్ర విసర్జన చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంకర్ మిశ్రా అనే వ్యక్తి, కోర్టు విచారణ సందర్భంగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వాస్తవానికి తాను ఎవరిపై మూత్ర విసర్జన చేయలేదని, ఆ మహిళే తన సీటులో మూత్ర విసర్జన చేసుకుందని ఢిల్లీ కోర్టు ముందు శుక్రవారం వెల్లడించాడు. తన పక్కనే ఉన్న వృద్ధ మహిళ తనను తానే మూత్ర విసర్జన చేసుకుని తనపై ఆరోపణలు చేస్తోందని కోర్టు వెల్లడించాడు. అతడిని విచారించేందుకు ఢిల్లీ పోలీసులకు సెషన్స్ కోర్టు నోటీసులు ఇచ్చిన అనంతరం శంకర్ మిశ్రా నుంచి ఇలాంటి స్పందన రావడం ఆసక్తికరంగా మారింది. 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ ‭కు పంపుతూ శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అతడిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. అంతే కాకుండా, బెయిల్ కోసం శంకర్ మిశ్రా చేసుకున్న దరఖాస్తును సైతం కోర్టు తోసిపుచ్చింది. మిశ్రా చేసిన చర్య చాలా కౄరమైదనదని ధర్మాసనం పేర్కొంది.


Post a Comment

0Comments

Post a Comment (0)