పిల్లలు కొట్టుకుంటే నాన్‌ బెయిలబుల్ కేసులా ?

Telugu Lo Computer
0


ఓ విద్యార్థిపై బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్ చేసిన దాడి ఘటనపై బాలానగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేంద్ర వర్సిటీ కమిటీ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అంతలోనే బాధితుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బండి భగీరధ్ తనకు మంచి ఫ్రెండ్ అంటూ బాధితుడు శ్రీరామ్‌ ట్విస్ట్ ఇచ్చాడు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని చెప్పాడు. పాత వీడియోను ఇప్పుడు ఎందుకు బయటపెట్టారో తెలియదన్నాడు శ్రీరామ్‌.మరోవైపు తన కుమారుడు భగీరథపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్‌ తనతో రాజకీయాలు చేయాలేతప్ప పిల్లలతో రాజకీయాలేంటని మండిపడ్డారు. పిల్లలు కొట్టుకుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. గతంలో సీఎం మనుమడిపై కామెంట్లు చేస్తే తానే స్వయంగా ఖండించానని, ఎప్పుడో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసులేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ర్యాగింగ్ పేరుతో ఓ విద్యార్థిపై దాడి చేసిన ఘటనలో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై కేసు నమోదు చేసినట్లు దుండిగల్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. విద్యార్థిపై బండి భగీరథ్ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్యలు తీసుకున్నారు. ఐపీసీ 341, 322, 504, 506, 34 సెక్షన్ల కింద బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ డీసీపీ సందీప్ రావ్ వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)