పుణ్య స్నానాలకు వెళ్లివస్తుండగా తిరిగిరాని లోకానికి....!

Telugu Lo Computer
0


అస్సాంలోని మోరిగావ్‌ జిల్లాలో ధరామ్‌తుల్‌ ఏరియాలో జాతీయ రహదారి 37పై రోడ్డు ప్రమాదం జరిగింది. మకర సంక్రాంతి సందర్భంగా ఒకే ప్రాంతానికి చెందిన కొందరు లోహిత్‌ నదిలో పుణ్య స్నానాలకు వెళ్లారు. పుణ్యస్నానాలు ముగించుకుని తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. యాత్రికులతో వెళ్తున్న వాహనం ఎదురుగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిని వారికి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)