హామీలన్నీ నెరవేరుస్తాం !

Telugu Lo Computer
0


పంజాబ్ లో 400 మొహల్లా ప్రాంతీయ వైద్యశాలలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ‭తో కలిసి ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ  జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలల్లోనే 500 మొహల్లా ప్రాంతీయ వైద్యశాలలను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఉన్న వైద్య వ్యవస్థకు తోడు వీటితో మరిన్ని వైద్య సేవలు అందిస్తాం. 70 ఏళ్లు పాలించినవారు పంజాబ్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. దాన్ని బాగు చేయాలంటే సమయం పడుతుంది. కాస్త ఓపిక పట్టండి. ఇచ్చిన హామీలన్నీ ఈ ఐదేళ్లలో నెరవేరుస్తాం అని అన్నారు. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని మొహల్లా దవాఖానాలకు ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‭కు స్ఫూర్తని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఇక ఢిల్లీ పాఠశాలలను తమిళనాడు ముఖ్యమంత్రి స్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)