ఔరా ! ఏమి తెలివి ?

Telugu Lo Computer
0

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఆదివారం ఒక వ్యక్తి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు భారీ లగేజ్‌తో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. కస్టమ్స్ అధికారులకు అతడి లగేజ్‌పై అనుమానం వచ్చి తెరిచి చూడగా దాని నిండా గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. గుట్కా పౌచ్‌లను చింపి పరిశీలించిన కస్టమ్స్‌ అధికారులు నోరెళ్లబెట్టారు. ప్రతి పౌచ్‌లో రెండేసి చొప్పున ఉన్న పది డాలర్ల నోట్లను వెలికితీశారు. భారత కరెన్సీలో రూ.32.78 లక్షల విలువైన 40 వేల అమెరికా డాలర్ల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దీనిపై ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కోల్‌కతా కస్టమ్స్‌ అధికారులు చేయగా అది వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)