గుండెపోటుతో 12 ఏళ్ల బాలుని మృతి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని మడికేరి జిల్లా కుశాల నగర్ లోని కూడుమంగళూరులో స్కూల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న మంజాచారి అనే వ్యక్తి కొడుకు12 ఏళ్ల కీర్తన్  ఆరవ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి వచ్చాడు. వచ్చిన కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ విలవిల్లాడుతూ కాసేపటికే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు కీర్తన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీశీలించిన డాక్టర్లు అప్పటికే కీర్తన్ చనిపోయాడని చెప్పారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి వరకు ఆడుకున్న పిల్లాడు 12 ఏళ్లకే గుండెపోటుతో చనిపోవటమేంటీ? ఇంత చిన్నవయస్సు వారికి కూడా గుండెపోటు వస్తుందా? అని కన్నీరు మున్నీరుగా విలపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)